అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానికి వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం పివిపికి చెందిన చెన్నైలోని ఆస్తుల వేలంకు కెనరా బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపై కేశినేని నాని విమర్శిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇంతలో కేశినేని నానికి చెందిన కార్గో క్యారియర్స్ ప్రైవేటు లిమిటెడ్ తీసుకున్న అప్పు తాలూకు వడ్డీతో సహా సుమారు మూడు కోట్ల 77లక్షల 48వేల చెల్లించనందున తనఖా పెట్టిన స్థిరాస్థిని స్వాధీనం చేసుకుంటున్నట్లుగా కెనరా బ్యాంకు నోటీసు జారీ చేసింది. దీనిపై పివిపి స్పందిస్తూ ఆ నోటీసును ట్యాగ్ చేస్తూ విమర్శలను గుప్పించారు.
టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి, ‘తమరు రోడ్డు మీద కార్న్ తింటూ కులసాగా తిరుగుతున్నారు. ఇక్కడ మీ సహచరుడు ఇస్మార్ట్ నాని వ్యాపారాలు మూసేసి అందరిని రోడ్డున పడేసి బెజవాడను దివాలా తీయిస్తున్నాడు. తమరు దయచేసి ఆ హెరిటేజ్ పాలు పంపిస్తే బారులు తీరిన అప్పుల వాళ్లకు ఒ కప్పు కాఫీ ఇస్తాం’ అంటూ వ్యంగ్యంగా పివిపి ట్వీట్ చేశారు.
ఒకరు ఆస్తుల వేలం నోటీసు ఆధారంగా, మరొకరు ఆస్తుల స్వాధీనం నోటీసు ఆధారంగా విమర్శల ట్వీట్లు చేసుకోవడం గమనార్హం.
.@ncbn తమరు రోడ్లు మీద కార్న్ తింటూ కులాసాగా తిరుగుతున్నారు. ఇక్కడ మీ సహచరుడు శ్రీ. Ismart Nani వ్యాపారాలు మూసేసి అందరిని రోడ్డున పడేసి బెజవాడను దివాలా తీస్తున్నాడు.
తమరు దయచేసి,ఆ హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు,ఓ కప్పు కాఫీ ఇస్తాం.@naralokesh @kesineni_nani pic.twitter.com/fBsCmcjtMg— PVP (@PrasadVPotluri) August 4, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?