కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనతో శ్రీకాకుళం జిల్లా టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు దూకుడు పెంచినట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న శ్రీకాకుళం ఎంపీ… పార్లమెంటు నియోజక వర్గం తరహాలో జిల్లా విభజన జరిగితే శ్రీకాకుళంకి మిగిలేది…శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, పాతపట్నం నియోజకవర్గలే. ఈ క్రమంలో మిగిలిన యాడ్చర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్ కు, పాలకొండ అరకు పార్లమెంట్ కు వెళ్లిపోతాయి.
అయితే వెళ్ళిపోయే ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందేవి కావటంతో శ్రీకాకుళంలో మిగిలేది ఏంటి అంటూ పార్టీలకతీతంగా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముందుగా స్పందించారు. సొంత ఎమ్మెల్యే కావటంతో ఆయన శ్రీకాకుళం జిల్లా విభజన విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయటంతో అధికార పార్టీలో కాక పుట్టించాయి.
పరిస్థితి ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలో మిగతా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ధర్మాన ప్రసాద్ మాదిరిగానే జిల్లా విభజనను వ్యతిరేకించే తరహాలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించలేదు. ఆ టైంలో టిడిపి నేతలు మౌనం పైన అనేక చర్చలు జరిగాయి. కాగా ఏడాదిన్నర వరకూ ప్రజా సమస్యలపై వివిధ అంశాలకు సంబంధించి ప్రధానికి లేఖలు రాసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజాగా జిల్లా విభజన విషయంలో సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా విభజన కానీయం అని చెబుతున్నారు.
ఈ క్రమంలో జిల్లా విభజనని సెంటిమెంట్ గా మార్చి అధికార పార్టీ వైసీపీ పై దూకుడు పెంచాలని పార్టీని బలోపేతం చేసే తరహాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు గ్రౌండ్ లెవెల్ లో స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఖచ్చితంగా ఈ విభజన అంశాన్ని పొలిటికల్ మైలేజ్ గా సంపాదించుకోవాలని, ఉత్తరాంధ్రలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి.. జిల్లా విభజనని సెంటిమెంట్ గా మలిచే రీతిలో వ్యూహాలు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు పార్లమెంటు పరిధిలో జిల్లాలను విభజించిన 2026 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పరిస్థితి ఏంటి అంటూ రామ్మోహన్ నాయుడు సంధిస్తున్న ప్రశ్నలు అధికార పార్టీని డిఫెన్స్ లోకి నటిస్తున్నట్లు, ప్రజలలో ఎంపీ మాటలు చర్చనీయాంశంగా మారిన ట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా జిల్లాల విభజన అంశాన్ని పొలిటికల్ గా అధికార పార్టీని దెబ్బకొట్టడానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.