గుంటూరు: గుంటూరు జిల్లా అభ్యర్థుల జాబితాలో టిడిపి అధిష్టానం స్వల్ప మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
నర్సరావుపేట పార్లమెంట్ సీటును రాయపాటి సాంబశివరావుకు బదులు భాష్యం రామకృష్ణకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిగా రాయపాటి కుమారుడు రంగారావుకు గుంటూరు పశ్చిమ టికెట్ ను ఇస్తున్నట్లు సమాచారం. టిడిపి అధిష్టానం ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మద్దాల గిరి పేరును ప్రకటించింది. రాయపాటి వారసునికి ఆ స్థానాన్ని కేటాయిస్తే గిరిని నర్సరావుపేట లేదా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది.
తాడికొండ సీటుపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. తాడికొండ సిట్టింగ్ సభ్యుడు శ్రావణ్ కుమార్ను కాదని ఆ స్థానాన్ని బాపట్ల సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రికి కేటాయించారు. దానిపై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అధిష్టానం ఆలోచనలో పడింది. తాడికొండలో మళ్లీ శ్రావణ్ కుమార్నే దింపే విషయం పరిశీలనలో ఉంది.