ఏపీలో టిడిపి పార్టీ పరిస్థితి ఉన్న కొద్దీ దిగజారి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన క్రమంలో… అధికారంలో వచ్చిన జగన్ జెట్ స్పీడులో సంక్షేమ పథకాలతో ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్న తరుణంలో టిడిపి నేతలకు ఫ్రేస్టేషన్ పెరిగినట్టు ఉంది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తుంటే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతుంది.
ఈ క్రమంలో మొదటిగా ఇప్పుడు విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ని టార్గెట్ చేసిన టిడిపి ఆయన పర్సనల్ విషయాలు బయటకు లాగి.. అనగా 108, 104 వాహనాల విషయంలో విజయసాయి రెడ్డి బంధువులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించిందని టిడిపి ఆరోపించింది. అప్పటినుండి టార్గెట్ చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో బొత్స సత్యనారాయణను కూడా టార్గెట్ చేస్తున్న టిడిపి తాజాగా చంద్రబాబు అవినీతి ని ప్రశ్నిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నీ గట్టిగా టార్గెట్ చేసింది.
విజయసాయి రెడ్డి విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు ని రంగంలోకి దింపిన టిడిపి సజ్జల రామకృష్ణా రెడ్డి విషయంలో టిడిపి నాయకుడు పట్టాభి నీ పార్టీ హైకమాండ్ బరిలోకి దించింది. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ఉద్యమం పై మరియు చంద్రబాబు నారా లోకేష్ ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.
ఈనేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ పట్టాభి మాట్లాడుతూ ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి కి చెందిన ఆర్ఆర్ గ్లోబర్ చరిత్ర అంతా తనకు తెలిసని, ఐరన్ ఓర్ ను ఎలా దోచుకున్నారు అనేది తనకు తెలియదా అని చెప్పుకొచ్చారు. సజ్జల చరిత్ర మొత్తం తనకు తెలుసని రోడ్డుపై నిలబడతానని… పట్టాభి వ్యక్తిగతమైన విమర్శలు చేశారు.