(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఆర్టిసి ఛార్జీల పెంపునకు టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అసెంబ్లీ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఇతర టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. మంగళగిరి నుంచి సచివాలయం వరకు ఆర్టిసి బస్సులో లోకేష్ ప్రయాణించి నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరి నుంచి సచివాలయానికి పది రూపాయలు ఉన్న టిక్కెట్ను 15 రూపాయలు చేశారనీ, ఒకే సారి ఐదు రూపాయలు పెంచారనీ లోకేష్ విమర్శించారు.