NewsOrbit
రాజ‌కీయాలు

YS Jagan BJP: జగన్ నినాదాన్ని ఎత్తుకున్న తెలంగాణ బీజేపీ..!!

YS Jagan BJP: 2019 ఎన్నికల ప్రచారం టైంలో.. అదేవిధంగా పాదయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఫలితంగా జరిగిన ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఇదే జగన్ నినాదాన్ని తెలంగాణ బీజేపీ ఎత్తుకుంది. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. “ప్రజా సంగ్రామ యాత్ర” పేరిట బండి సంజయ్ చేపడుతున్న ఈ యాత్ర ప్రస్తుతం నారాయణపేట జిల్లాకు చేరుకుంది.

YS Jagan 340th day of Padayatra Highlights | వైఎస్‌ జగన్ 340వ రోజు పాదయాత్ర విశేషాలు - YouTube

ఈ సందర్భంగా ఇటీవల అక్కడ వాల్మీకి, బోయల వద్దకు వెళ్లి బండి సంజయ్ ముచ్చటించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీని గెలిపిస్తే వాల్మీకుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మత పరమైన రిజర్వేషన్ లకు బీజేపీ వ్యతిరేకమని..అన్నారు. అదేవిదంగా వాల్మీకులను ఎందుకు ఎస్టీ జాబితాలో చేర్చడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మజ్లిస్.. కేసిఆర్ కుమ్మక్కు రాజకీయాల వల్లే రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరుగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఎవరు గాని కేసిఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చేయనీ సెటైర్లు వేశాడు. కేసిఆర్ కుటుంబం నెలకు పాతిక లక్షల జీతం తీసుకుంటుందని చెప్పారు. కేసిఆర్ ని గద్దె దించాలన్న కసితో పాదయాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Ongoing Bandi Sanjay Padayatra in Gadwala District .. Ongoing Bandi Sanjay Padayatra in Gadwala District .. - Janta Yojana

రాష్ట్రంలో రిజర్వాయర్ లకు నీళ్లు రావు గాని.. కేసీఆర్ ఫామ్ హౌస్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తేప్పించుకుంటారు అని బండి సంజయ్ ఆరోపించారు. నారాయణపేట జిల్లాలో కూడా నీటి సమస్య ఉంది. మూడు కోట్లకు పైగా ఖర్చు పెడతే ఈ ప్రాంతానికి ప్రభుత్వం మేలు చేసినట్లువుతుంది. ఆరు నెలల్లో నీళ్లు తీసుకురావచ్చు. మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత ఏడు సంవత్సరాల నుండి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. “దళితబంధు” పేరుతో దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంత మంది దళితులకు “దళిత బందు” ఇచ్చారో లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లించారు అని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నారాయణపేట ప్రజలను బండి సంజయ్ కోరారు. తెలుగు రాజకీయాలలో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ దిశగానే బండి సంజయ్ .. ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ బీజేపీకి పట్టం కడతారో లేదో చూడాలి.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?