కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన తరువాత బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఇంతలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్ష పదవీ పగ్గాలు అప్పచెప్పింది. తెలంగాణలో బీజేపీ ని ఎలాగైనా పైకి తీసుకురావడానికి బండి సంజయ్ కచ్చితంగా ఉపయోగపడతాడు అని పార్టీ అధిష్టానం అభిప్రాయపడింది. ఇంత వరకు బాగానే ఉన్నా రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని గాడిలో పెట్టడం, పార్టీ ఇమేజ్ పెంచటం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం ఉద్యమాల్లో పార్టీ క్యాడర్ ని ప్రజలను భాగస్వామ్యులు చేయటం ఇలాంటి విషయాలు బండి సంజయ్ కి సవాలుగా మారుతున్నట్లు పార్టీలో ఓ వర్గం భావిస్తోందట.
కార్పోరేటర్ నుండి అనూహ్యంగా ఎంపీగా గెలవడంతో అనతికాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం చకాచకా సాగిపోయింది. కాగా బీజేపీ అధిష్టానం ఎప్పటినుండో పార్టీలో ఉన్న పెద్దలను కాదని బండి సంజయ్ కి పదవి బాధ్యతలు అప్పజెప్పడం తో తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ పెత్తనాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో కరీంనగర్ బిజెపి లో కూడా అంతర్గత గొడవలు స్టార్ట్ అయినట్లు టాక్. ఎన్నికలలో సంజయ్ గెలుపు కోసం పనిచేసిన వారిని చాలా వరకు దూరం పెడుతున్నారట. బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ పరిస్థితి ఇలానే ఉండటం తో …. పార్టీని ఎలా ముందుకు నడిపించాలో అన్న దాని విషయంలో బండి తెగ టెన్షన్ పడుతున్నారట
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?