NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ ఒంటరేనా…??

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) లక్ష్యంగా తీవ్ర విమర్శలు సంధిస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఒంటరి వాడు అవుతున్నాడా? కెసిఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం వ్యక్తిగతమా? రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలే మండిపడటానికి కారణాలు ఏమిటి? అనే విషయాలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్నది అందరికీ తెలిసిందే. మొదట తెలుగుదేశంలో ఉన్నప్పుడు గానీ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కూడా రేవంత్ రెడ్డి..ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుటుంబంపై తరచు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలోనే టిడిపి హయాంలో ఉండగా ఒక సారి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు జైలుకు వెళ్లారు. ఇటీవల కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద అనుమతులు లేకుండా డ్రోన్‌ కెమెరా వినియోగించారన్న అభియోగంపై అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయన బెయిల్ ధరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. వీటికి తోడు గోపన్‌పల్లి భూకుంభకోణం ఆరోపణలు కూడా ఆయనపై చుట్టుమట్టాయి.

ఈ నేపథ్యంలోనే ఆయనపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సీనియర్ నేత వి హనుమంతరావు ఒక అడుగు ముందుకు వేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని మాట్లాడటానికి ఇది ప్రాంతీయ పార్టీ కాదనీ, ఏ విషయంపై అయినా కాంగ్రెస్ పార్టీలో చర్చించి పోరాటాలపై నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ఆయన (రేవంత్)పై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదని అంటున్నారు విహెచ్. జివో 111, మంత్రి కెటిఆర్ ఫామ్ హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం ఆయన వ్యక్తిగతమైనదని విహెచ్ వ్యాఖ్యానించారు. ఎలాంటి అంశమైనా పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలనీ, ఎవరికి వారుగా కార్యక్రమాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్న నేతలను ఇబ్బందిపెట్టేలా రేవంత్ రెడ్డి వ్యవహరించడం మంచి పద్ధతి కాదని మరో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు వెంటనే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆయన కోరారు.

ప్రధానంగా కెటిఆర్ ఫామ్ హౌస్ జివో నెం.111ను ఉల్లంఘించి కట్టారని ఆరోపిస్తున్నారో ఆ జివోనే రద్దు చేయాలని ఆ పార్టీ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్శింహాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ జివో వల్ల తమ ప్రాంతంలో అనేక మంది రైతులు, పారిశ్రామిక వేత్తలు ఇబ్బందులు పడుతున్నారనీ, కాంగ్రెస్ హయాంలోనే ఈ జివో రద్దు చేయాలని తాము ప్రతిపాదించామనీ వారు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో పోరాటం చేస్తూ రేవంత్ రెడ్డి అరెస్టు కాగా కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రమే ఖండించారు. రేవంత్ అరెస్టు వ్యవహారాన్ని అటు పార్లమెంట్‌లో, ఇటు అసెంబ్లీలోనూ చర్చించాలని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు పట్టుబట్టలేదు అంటే ఆ పార్టీ నాయకులు దీన్నిలైట్‌గా తీసుకున్నారా అనే వాదన వినిపిస్తోంది.

కాంగ్రెస్ సీనియర్‌ల వ్యవహారాల శైలి రేవంత్ వర్గీయులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో వీరు రేవంత్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలని కూడా సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గం నుండి వరుసగా రెండు సార్లు టిడిపి అభ్యర్థిగా గెలిచిన రేవంత్ రెడ్డిని 2017 అక్టోబర్ మొదటి వారంలో టిడిపి సస్పెండ్ చేయడంతో అదే నెల చివరిరో ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. స్టార్ క్యాంపెయినర్ ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఆ ఎన్నికల్లో తొలి సారిగా ఆయన కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్రరెడ్డి చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. అయితే కొడంగల్‌లో ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి సారించి 2019 ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటి కొడంగల్‌లో పాగా వేయాలని రేవంత్ రెడ్డి భావించినా ఫలితాల్లో మాత్రం వ్యతిరేక పవనాలు వీచాయి. కొడంగల్ మున్సిపాలిటీలో ఉన్న 12 వార్డుల్లో 8 వార్డులు అధికార టీఆర్‌ఎస్ కైవశం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి పట్టు సాధించలేకపోవడంతో ఆ పార్టీ సీనియర్‌లు కొందరు ఆయన ఒంటెత్తు పోకడలకు పోతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Leave a Comment