హైదరాబాద్: తెలంగాణలో మళ్ళీ ఎన్నికల జాతర మొదలయ్యింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నది. ఓట్ల లెక్కింపు మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత చేపట్టనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 535 జెడ్పిటిసి స్థానాలు, 5857 ఎమ్పిటిసి స్థానాలు ఉన్నాయి. గత పంచాయితీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా వరకు పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మెజారిటీ జెడ్పిటిసిలు, ఎమ్పిటిసిలను టిఆర్ఎస్ గెలుచుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో వరుస ఎన్నికలతో హడావిడి నెలకొన్నది. కొద్ది నెలల క్రితమే శాసన సభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయితీ ఎన్నికలు జరిగాయి. రెండు రోజుల క్రితమే లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చాయి.
ఎమ్పిటిసి, జెడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్:
నామినేషన్ | స్క్రూట్నీ | నామినేషన్ ఉపసంహారణ | ఫిర్యాదులు | పోలింగ్ | |
ఫస్ట్ ఫేజ్ | ఏప్రిల్ 22నుంచి 24వరకు | ఏప్రిల్ 25న | ఏప్రిల్ 28 వరకు | ఏప్రిల్ 27న | మే 6న |
సెకండ్ ఫేజ్ | ఏప్రిల్ 26నుంచి 28వరకు | ఏప్రిల్ 29న | మే 2 వరకు | మే 1న | మే 10న |
థర్డ్ ఫేజ్ | ఏప్రిల్ 30నుంచి మే2వరకు | మే 3న | మే 6 వరకు | మే 5న | మే 14న |