టీడీపీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణకు మరో సారి అవకాశం కల్పించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల పలువురు తెలంగాణ సీనియర్ నేతలు నాయకత్వాన్ని మార్పు చేయాలంటూ చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.పార్టీ నేతల అభ్యంతరాలను చంద్రబాబు పక్కన పెట్టారు. అయితే ఎల్ రమణ అధ్యక్షుడుగా నూతన కమిటీని ఏర్పాటు చేస్తూనే మరో ఆరుగురితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు చంద్రబాబు. కోఆర్డినేటర్ కమిటీలో ఎల్ రమణతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీలు కొత్తకోట దయాకర్ రెడ్డి, బక్కిని నర్శింహులు, జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు చిలువేరు కాశీనాధ్లను నియమించారు.
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నందమూరి సుహాసిని, లక్ష్మణ్ నాయక్ రమావత్, అలీ మస్కటీ. సామా భూపాల్ రెడ్డి, డి శ్రీశైలం, బండి పుల్లయ్య, గుండు సావిత్రమ్మ, గట్టు ప్రసాద్, గంధం గురుమూర్తి, డాక్టర్ వాసిరెడ్డి రామనాధం. ఎండి తాజుద్దీన్, కాట్రగడ్డ ప్రసూన, స్టేట్ జనరల్ సెక్రటరీలుగా ఐలయ్య యాదవ్, ఎకే గంగాధర్ రావు, గడ్డి పద్మావతి, అజ్మీర రాజు నాయక్, గన్నోజు శ్రీనివాస చారి, ప్రదీప్ చౌదరి, జివిజి నాయుడు, మహమ్మద్ అరీఫ్, తాళ్లూరి జీవన్, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నల్లారి దుర్గా ప్రసాద్, గుండు భూపేష్, చావా కిరణ్మయి, కరణం రామకృష్ణ, ఇందిర, ఎం శ్రీనివాసరెడ్డి, ఎఁ రామేశ్వరరావు, శ్రీనివాస్ నాయుడు, అల్లూరి రాజారెడ్డిలును చంద్రబాబు నూతన కమిటీలో నియమించారు.