Big Breaking: తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతున్నట్లు తాజా రాజకీయాలపై చాలా మంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తగలటంతో ఎన్నడూ లేని విధంగా 23 సీట్లకు పరిమితం అయినా పార్టీ .. ఇటీవల ఏపీ లో జరిగిన ఉప ఎన్నికలలో .. స్థానిక ఎన్నికలలో కూడా ఏమాత్రం పుంజుకొని పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికొస్తే 2014 ఎన్నికల తర్వాత మధ్యలోనే “ఓటుకు నోటు కేసు” ఎపిసోడ్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిన అప్పటి నుండి టిడిపి తెలంగాణలో కనుమరుగవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
కొద్దో గొప్పో ఉన్న నయకులలో తెలంగాణలో టీడీపీ పగ్గాలు నమ్మిన బంటు ఎల్ రమణ చేతికి అప్పజెప్పేసి… చంద్రబాబు నాయుడు చాలా వరకు సైలెంట్ అయిపోయారు. పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల మహానాడులో తెలంగాణలో సరైన సమయం పార్టీపై దృష్టి పెట్టాలని ఎల్.రమణ చంద్రబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఊహించని విధంగా ఎల్ రమణ ఇప్పుడు పార్టీ మారటానికి రెడీ అయినట్లు త్వరలోనే టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వు బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇదే జరిగితే తెలంగాణలో ఇంకా చంద్రబాబుకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే అనే టాక్ తెలుగు రాజకీయాల్లో వినబడుతుంది.