హైదరాబాద్/అమరావతి, జనవరి 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరు కార్యక్రమాల నిమిత్తం రాజధానికి వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళనున్నారు. రాష్ట్రంలో హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆయన కలసి ఆహ్వానించనున్నారు.
బుధవారం ఢిల్లీలో జరిగే భారతీయ జనతాపార్టీ వ్యతిరేక కూటమి నేతలతో భేటీలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సభల గురించి ప్రధానంగా చర్చించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఆయన ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయలుదేరి వెళతారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రికి ఆయన హైదరాబాద్ బయలుదేరి వస్తారు.
previous post