పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం తువ్వచిలుక రాయుడుపాలెంలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ హత్యాచార ఘటన మరువక ముందే ఏపిలో ఎనిమిదేళ్ల బాలిక మృగాళ్ల చేతిలో బలైంది. సాయంత్రం సమయంలో స్నానం చేసి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలికన కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు, కుుటంబ సభ్యులు గాలించారు. చివరకు గ్రాామ శివారులోని రేకుల షెడ్డులో బాలిక మృతదేహం ఉండటాన్ని గమనించారు. అక్కడ మంచంపై బాలిక ముఖం మీద దిండు పెట్టి హత్య చేసినట్లు అనవాళ్లు కనుగొన్నారు. తమ పాపపై కొందరు అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, పోలీసు జాగిలాలతో ఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరించారు. పోలీసులు గ్రామంలో విచారణ చేసిన సందర్భంలో ఇద్దరు యువకులు బాలికకు బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ సునీల్ మాట్లడుతూ బాలిక మృతిపై పోస్టుమార్టం నివేదిక, క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు జరిపి దోషులను పట్టుకుంటామని తెలిపారు. ఇప్పటికే బాలిక కుటుంబ సభ్యులు పలువురు అనుమానితుల పేర్లు వెల్లడించారనీ వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామన్నారు.