టిడిపి పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ప్రపంచం అంతా గమనిస్తుంది అని వ్యాఖ్యానించారు. పాదయాత్ర పేరుతో వీధివీధి తిరిగి జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలను వీధి పాలు చేశారు అంటూ ఆమె మండిపడ్డారు. పోలీసుల సాయంతో ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్న జగన్ అమరావతి కోసం పోరాడుతున్న రైతులు మరియు మహిళలను మాత్రం టచ్ చేయలేకపోయారని పేర్కొన్నారు. అదేవిధంగా నాలుగడుగుల ప్రభుత్వ స్థలం ఆక్రమించారని సబ్బం హరి ఇంటి గోడను పడగొట్టిన జగన్ ప్రభుత్వం… 33 వేల ఎకరాలు కోల్పోయిన వారి బాధను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని ఆమె ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం దళితుల ఎదుగుదలను అందువల్లే దళిత రాజధాని పై కక్ష కట్టింది అంటూ ఆరోపించారు. అదే విధంగా జగన్ విశాఖను రాజధానిగా గుర్తించిన తర్వాత దాదాపు అక్కడ 73 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి అని అది అసలైన ఇన్ సైడర్ ట్రేడింగ్ అని మండిపడ్డారు. అదే విధంగా వాలెంటర్ వ్యవస్థ అంటూ ఏపీ యువత భవిష్యత్తు జగన్ నాశనం చేస్తున్నారని విమర్శించారు.
అదేవిధంగా వాలంటీర్ గా పనిచేసే వాళ్లు 50 ఏళ్లు తమ ఉన్న పింఛన్లు రేషన్ పంచితే తమకు భవిష్యత్తు ఉంటుంది అని భావిస్తే అది చాలా మూర్ఖత్వమని పేర్కొన్నారు. జగన్ చిత్తశుద్ధితో చంద్రబాబు తలపెట్టిన అమరావతిని కంప్లీట్ చేస్తే దాదాపు 13 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేదని ఈ సందర్భంగా టిడిపి నేత దివ్యవాణి చెప్పుకొచ్చింది. చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే తమ రాష్ట్రాలు బాగుపడావని అందుకే ఏపీ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కు జై కొడుతున్నారు అంటూ ఎద్దేవా చేసారు. న్యాయవ్యవస్థపై అంత దూకుడు పనికిరాదు అంటూ ఎద్దేవా చేశారు.