Sharmila : తెలుగు రాజకీయాలలో షర్మిల కొత్త పార్టీ వ్యూహం సరికొత్త రాజకీయాలకు తెర లేపుతోంది. చాలావరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా రాజకీయ పార్టీలు షర్మిల కొత్త పొలిటికల్ పార్టీ న్యూస్ పై రక రకాలుగా స్పందిస్తున్నారు. కెసిఆర్ విసిరిన బాణం అని కొంతమంది అంటుండగా.. మరికొంతమంది బీజేపీ విసిరిన బాణం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఉన్న వైసీపీ మాత్రం షర్మిల వ్యవహరిస్తున్న తీరుకు తమకు ఎటువంటి సంబంధం లేదని.. వైసీపీ పార్టీకి చెందిన పెద్దలు పేర్కొంటున్నారు. ఇటువంటి గందరగోళం పరిస్థితుల్లో షర్మిల మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులుగా వుండే జిల్లాలలో వ్యూహాత్మకమైన అడుగులు వేస్తూ ఉంది.
ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కీలక నాయకులకు ఏరవేస్తూ షర్మిల ఆండ్ టీం ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్. దీంతో చాలా వరకు షర్మిల వ్యూహాలతో ఆ రెండు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ షర్మిల వైపు చూస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ రెండు జిల్లాలలో గల్లంతయ్యే పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పడిపోవడంతో పాటు చాలామంది కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూసే పరిస్థితి తెలంగాణలో ఉందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో షర్మిల ఎంట్రీ ఇవ్వటంతో నల్గొండ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న కీలక కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఆమె పార్టీలో కి వెళ్ళటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది షర్మిలతో టచ్ లో ఉన్నట్లు.. ఆ రెండు జిల్లాల రాజకీయాల టాక్ నడుస్తుంది.