ప్రపంచంలో టూరిజానికి కేరాఫ్ అడ్రస్ గా పిలవబడే టర్కీ దేశానికి కష్టాలు వచ్చాయి. త్వరలో ఆ దేశంలో కరువు విలయ తాండవం చేయడం గ్యారెంటీ అని ఆ దేశ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో టర్కీ దేశం ఎడారిగా మారబోతుందని తెలిపారు. ముఖ్యంగా ఎప్పుడూ నీటితో కళకళలాడే టర్కీ దేశం రాజధాని ఇస్తాంబుల్ ఎడారిగా మారటం గ్యారెంటీ అని ఆ దేశ నిపుణులు హెచ్చరించారు.
రాబోయే 45 రోజుల్లో టర్కీ దేశంలో నదులు, జలాశయాల తో పాటు డ్యాములు సైతం ఎండిపోయి తీవ్ర కరువు రాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. టర్కీ లోని ప్రధాన నగరాలలో వచ్చే కొన్ని నెలల్లోనే నీళ్లు ఎండిపోయి ఎడారిని తలపించే రీతిలో దేశ పరిస్థితులు మారనున్నట్లు తెలిపారు. దీనికంతటికీ ప్రధాన కారణం దేశంలో అతి స్వల్ప వర్షపాతం నమోదు కావడమే అని చెప్పుకొచ్చారు. ఆహార కొరతతో పాటు దేశంలో 17 మిలియన్ల ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆ దేశ నిపుణులు హెచ్చరించారు. జనవరి 10 నుండి 110 రోజుల్లో దేశంలో ప్రధాన డ్యాములు మొత్తం ఖాళీ అవడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆ దేశానికి చెందిన ప్రభుత్వ అధికారులు కరువును ఎదుర్కోవడం కోసం ఇప్పటి నుండే అప్రమత్తం అవుతున్నట్లు సమాచారం.