Neelam sahni : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా ఈ నెల చివరిలో నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా ని.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. గతంలో చీఫ్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పదవి ముగియడంతో, వెంటనే జగన్ ప్రభుత్వం.. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
అయితే ఇటీవల ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీకాలం ముగియడంతో…కొత్త ఎన్నికల కమిషనర్ పదవి విషయంలో ఏపీ ప్రభుత్వం గవర్నర్ దృష్టికి .. ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ వారిలో నీలం సాహ్ని పేరు చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఓకే చేయటంతో ఆమెకు ఈ పదవి రావటం జరిగింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత… మొట్టమొదటి మహిళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా .. నీలం సాహ్ని నియమితులు అవ్వడం విశేషం.