కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాల స్థితి గతులన్నీ తలకిందులుగా మారాయి. ఎందరినో రోడ్డున పడేసిన ఘనత కరోనా వైరస్ కే దక్కింది. మరెందరినో ఆకలి చావులకు దారితీసింది. మరీ ముఖ్యంగా పొట్ట చేతిన పట్టకుని వలసలు వచ్చి పట్టణాల్లో వీధి వ్యాపారం చేసుకునే వారి జీవితాలు మరీ దుర్భరం. కరోనా రేపుతున్న కళకలం మూలంగా చాలా మంది వీధి వ్యాపారులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా జీవనోపాధి దెబ్బతిన వారికి కేంద్రం తీపి కబురు చెప్పింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రేపు వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేయనున్నట్లు సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ చెప్పారు. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన(పీఎం స్వనిధి స్కీమ్) కింద దాదాపు 3 లక్షల మంది వీధి వ్యాపారులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రుణాలను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు రాయితీ వడ్డీపై రూ10,000 వరకు వర్కింగ్ కేపిటల్ ను అందించనున్నారు.
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా జూన్ 1 న వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు సబ్సిడీ రేటులో రూ.10,000 మూలధనాన్ని పొందవచ్చును.
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఈ పథకం తీసుకురావడం జరిగింది. కాగా ఇప్పటి వరకు 24 లక్షల మందికి పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12 లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయి. కాగా ఇప్పటి వరకు రూ5.35 లక్షల రుణాలను పంపిణీ చేశారు. కేంద్రం చేస్తున్న ఈ సహాయం మూలంగా నైనా వారి బతుకుల్లో కొంచమైనా వెలుగు వస్తుందేమో చూడాలి మరి..