ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్ణయాన్ని జగన్ ఎప్పుడైతే తెరపైకి తీసుకువచ్చారో.. ఏపీ రాజకీయ ముఖచిత్రం అంతా మారిపోయింది అని అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వాటిపై తీర్పులు ఇంకా రాని పరిస్థితి నెలకొంది. అయితే మరోపక్క మాత్రం విశాఖలో వైసిపి పార్టీ బడా నేతలు చకచకా పనులు చేసుకుంటూ పోతున్నట్లు పొలిటికల్ టాక్ వస్తుంది.
అంతేకాకుండా జగన్ అండ్ కో పాలనా కి సంబంధించి భవనాలు అంతా రెడీ చేస్తున్నట్లు కూడా ఏపీ రాజకీయ వర్గాలలో వార్తలు వినబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖ రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ లో యాంకర్ కొత్త ఏడాదిలో విశాఖకి పాలన ఎప్పుడూ వెల్ల బోతున్నది అని ప్రశ్నించగా.. బొత్స సమాధానమిస్తూ ఎనీ టైం అని పేర్కొన్నారు.
చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో విశాఖ కి పాలన రావటం గ్యారెంటీ.. అది ఏ క్షణమైనా అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమమని కచ్చితంగా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని స్పష్టం చేశారు. చంద్రబాబు అండ్ కో తమ సామాజిక వర్గం మేలుకోసం అడ్డంకులు సృష్టిస్తున్నారని వాటన్నిటినీ అధిగమిస్తామని ఖచ్చితంగా విశాఖకు పరిపాలన రాజధాని రావటం గ్యారెంటీ అన్నట్టు వచ్చే ఉగాది పండుగ నాటికి ఏదైనా జరగొచ్చు అంటూ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.