ఇండియాలో కరోనా వైరస్ మొట్టమొదట బయటపడిన రాష్ట్రం కేరళ. వైరస్ ప్రారంభంలో కేరళలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడటంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఒక్క కేసు రావటంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు అన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఆపేయటం జరిగింది. అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా దేశంలో అన్ని రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి చెందడంతో లాక్ డౌన్ మన చేసిన సంగతి తెలిసిందే. అయితే తే.గీ కరోనా కట్టడి విషయంలో కేరళ ప్రభుత్వం ప్రారంభంలో అనుసరించిన విధానాలకి అంతర్జాతీయ స్థాయిలో మొదటిలో ప్రశంసలు దక్కాయి.
కానీ ఇటీవల ఓనం వేడుకలు కేరళ రాష్ట్రాన్ని కొంప ముంచాయి. మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ కేసుల సంఖ్య కేరళలో విపరీతంగా పెరిగిపోవడంతో… అక్కడ సిపిఎం ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, సరి కొత్త చట్టాలు అమలు చేస్తోంది. అయితే ఇటీవల ఓనం పండుగ నేపథ్యంలో కరుణ కేసుల సంఖ్య పెరగడంతో కేరళ సీఎం పినరయి విజయన్ కి టెన్షన్ పట్టుకుందట.
దీంతో వెంటనే ఆ రాష్ట్రంలో సెక్షన్ 144,151,149 వంటి చట్టాలను కఠినంగా అమలు అయ్యేలా చూస్తున్నారు. దీంతో కేరళలో ప్రజలు ఎక్కడైనా గుంపు గా ఉంటే పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అంతేకాకుండా సభలకు సమావేశాలకు ఎక్కడా కూడా అనుమతులు ఇవ్వడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా కట్టడి విషయంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి కానీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తి లేదని సీఎం అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కేరళలో బయటపడుతున్న కేసులు బట్టి రెండో దఫా లాక్ డౌన్ అమలు అయ్యేలా నిర్ణయాలు తీసుకో బోతున్నట్లు టాక్.