2019 ఎన్నికల ఫలితాల దెబ్బ చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారిగా అధికారంలో ఉన్న పార్టీ కొద్ది పార్టీ బలంతో ప్రతిపక్షంకి వచ్చేయడంతో వచ్చిన ఫలితాలు చూసి టిడిపిలో ఉన్న సీనియర్ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా గతంలో అధికారంలో ఉన్న సమయంలో అమరావతి మరియు కొన్ని విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి చిన్న క్లూ దొరికితే చాలు టిడిపి నాయకులను జైల్లో పెట్టిం చేస్తున్నారు.
మరోపక్క మోడీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనపై చంద్రబాబు చేసిన కామెంట్లు ఎప్పటికీ తలుపులు టిడిపికి తెరవని పరిస్థితి. దీంతో అధికారంలో ఇటు రాష్ట్రంలో ఉన్న జగన్ అటు కేంద్రంలో ఉన్న మోడీ చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి మొన్నటి వరకు ఉంది. కానీ తాజాగా పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబుని మరింత టెన్షన్ పెట్టేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే 2019 సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్టణం ప్రాంతంలో నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి తరఫున గెలవడం జరిగింది.
కాగా నలుగురిలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇప్పటికే జగన్ సమక్షంలో కండువా కప్పుకోవడం జరిగింది. ఈ పరిణామంతో టెన్షన్ లో పడ్డ చంద్రబాబుకి మరో ఎమ్మెల్యే గణబాబు కూడా పార్టీ మారటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉన్నా ప్రతిపక్షం ఉడిపోయే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుందేమో అని చంద్రబాబు కి టెన్షన్ పట్టుకున్నట్లు సమాచారం. పైగా చాలా వరకు వైసిపి కేసులు అంటూ దూకుడుగా వెళ్తున్న తరుణంలో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ ఉండదేమో అన్న భావనలో ఉన్నట్లు పార్టీలో టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా అ పార్టీ చాలా వరకు అమరావతి ప్రాంతానికి మద్దతు తెలుపుతున్న తరుణంలో స్థానికంగా ఉన్న ప్రజల ఒత్తిడి మేరకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ పార్టీకి జై కొట్టినట్లు విశాఖ జిల్లా రాజకీయాల్లో వినబడుతున్న టాక్.