సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అప్పుడే ప్రచారం స్టార్ట్ అయిన సందర్భంలో కాకినాడలో జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించిన ఆ రాత్రి వైయస్ వివేకానంద రెడ్డి చనిపోవటంతో ఏపీ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్న చంద్రబాబు పార్టీ… ఇది జగన్ పార్టీ నాయకులు చేసిన పని అని, గెలవడం కోసం హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోపక్క వైసీపీ అధికారంలో ఉన్న టిడిపి పార్టీ నేతలే ఇది చేశారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
అయితే తన తండ్రి హత్య విషయంలో తనకు అనుమానాలున్నాయని కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు సిబిఐ విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన సిబిఐ విచారణ పకడ్బందీగా చేస్తుంది. మొదటి విడతగా 15 రోజులపాటు కడపలో సిబిఐ కార్యాలయంలో ఈ హత్య కి సంబంధించి ప్రతి అనుమానితుడిని సిబిఐ విచారించడం జరిగింది. ఆ తర్వాత 40 రోజులు గ్యాప్ ఇచ్చిన సిబిఐ మళ్లీ తాజాగా విచారణ మొదలు పెట్టడంతో….ఈసారి కీలక విషయాలు బయట పడినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల పులివెందులలో చెప్పుల షాపు యజమానిగా ఉన్న మున్నా అనే వ్యక్తి తో పాటు అతని కుటుంబ సభ్యులను సిబిఐ విచారణ చేయడం జరిగిందట.
అప్పట్లో వైయస్ వివేకానంద రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో ఆ కుటుంబానికి సంబంధించి ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వటంతో సిబిఐ విచారణ చేసినట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ విచారణలో భాగంగా మున్న బ్యాంకు లాకర్ లో సిబిఐ అధికారులు భారీగా నగదుతో పాటు 25 తులాల బంగారాన్ని గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లావాదేవీలు మున్నా ఖాతా నుండి ఎవరెవరికి ట్రాన్సక్షన్ జరిగాయి అన్న వాటిపై లోతయిన దర్యాప్తుకి సిబిఐ రెడీ అయింది. విచారణలో భాగంగా పులివెందులకు చెందిన మరికొంతమందిని అదేవిధంగా ఓ ఎంపీ యొక్క సన్నిహితుడని సిబిఐ విచారించి అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఎంపీ అనుచరుడు ఫోన్ సిబిఐ స్వాధీనం చేసుకున్న ఈ వార్త సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రం మొత్తం షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందట.