టిడిపి పార్టీ నాయకుల లో కేడర్ లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై ఉన్న అభిప్రాయం గురించి అందరికీ తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ గోరంగా ఓడిపోవడం జరిగింది. అంతకుముందు పార్టీ పదవి చేపట్టి మంత్రి పదవి అందుకున్న లోకేష్…. చాలా బహిరంగ సమావేశాలలో పార్టీ సమావేశాలలో మరియు మీడియా ముందు నవ్వులపాలైన సందర్భాలు ఉన్నాయి. దీంతో చాలా వరకు రాజకీయాల్లో లోకేష్ అన్ ఫిట్ అనే భావనకు పార్టీలో ఉన్న నాయకులే ముందునుండి లోలోపల గుసగుసలాడుతున్నారు అని మీడియా వర్గాలలో కూడా ఏపాటి నుండో టాక్ ఉంది.
అంతే కాకుండా చాలామంది పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చంద్రబాబు కి…. లోకేష్ కి కనుక బాధ్యతలు అప్పజెప్పితే పార్టీ నష్టపోవటం గ్యారెంటీ అని కూడా సూచించినట్లు కూడా పార్టీలో టాక్. ఇటువంటి తరుణంలో నందమూరి వారసులకు పార్టీ పగ్గాలు అప్పజెప్పలని కూడా కొంతమంది సూచించారు. కానీ వారి చేతిలోకి పార్టీ వెళ్తే, ఇక పూర్తిగా లోకేష్ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని చంద్రబాబు భావించారట. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయమైన ఘటన ప్రభుత్వాన్ని తెగ టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ చైర్మన్ స్వామి నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
చంద్రబాబు హయాంలోనే సింహాల బొమ్మలు మాయమై ఉండొచ్చని, గతంలో దుర్గగుడిలో క్షుద్ర పూజలు జరిగాయి అని స్వామి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తల్లి భువనేశ్వరి అప్పటి ఆలయ ఈవో తో ఫోన్ లో మాట్లాడి పూజలు చేయించారు అని అన్నారు. అలా చేస్తే రాజకీయంగా లోకేష్ కి తిరుగు ఉండదు అన్న భావనతో పూజలు చేసినట్లు….ఆలయంలోకి అప్పట్లో ముగ్గురు వ్యక్తులు వెళ్లి అర్ధరాత్రి పూజలు చేయించారని తెలిపారు. దీంతో కొడుకు లోకేష్ కోసం తండ్రి చేసిన పనులు సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు… వింతగా కామెంట్లు చేస్తున్నారు.
లోకేష్ గురించి తెలిసిన గాని తండ్రిగా చంద్రబాబు పడిన ఆరాటం, ఆయనలో ఉన్న గొప్ప తండ్రికి సాదృశ్యం అని ఈ విషయంలో జగన్ అయినా ఒప్పుకోవాల్సిందే అని నెటిజన్లు ఎటకారం అయిన కామెంట్లు పెడుతున్నారు. నిజంగా చంద్రబాబు లోకేష్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే నాలుగు గోడల మధ్య కాకుండా….. ప్రజలలో నాయకుడి మాదిరిగా నడిపిస్తే అవకాశం ఉంటుందని మరికొంతమంది సూచిస్తున్నారు. ఈ క్షుద్ర పూజలు ఇవికాక ప్రజల్లోకి లోకేష్ నీ వదిలేయాలని అంటున్నారు.