Andhra Pradesh సీఎం జగన్ YS Jagan Mohan Reddy లెక్కలు వేరే ఉంటయ్. పార్టీ అధినేతగా.., ప్రభుత్వాధినేతగా.. జగన్ చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. నిశిత పరిశీలన, నిశిత ఆలోచన చేస్తారు. అవినీతిపై ప్రభుత్వ సైలెన్స్.., ఓ మంత్రి పేకాట డెన్ పై పోలీసుల దాడులు.., తన శాఖలో వరుసగా వైఫల్యాలు ఉంటె మరో మంత్రి ఘాటు వ్యాఖ్యలు ఆపై తిరుగుబాటు.., వరుస ఘటనలతో హోమ్ శాఖ వైఫల్యం.., కొందరు మంత్రుల సైలెన్స్.. ఇలా అన్నిటికీ సీఎం దగ్గర సమాధానాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కో మంత్రికి ఫిటింగులు లెక్క. ఊస్టింగులుకి సాకులు లెక్క. మాజీలు అవ్వడానికి కౌంట్ డౌన్ కింద లెక్క వేసుకోవచ్చు..! కాకపోతే….
ఎవరి సీటు కి ఎసరు..!?
మంత్రులకు మొదటి రోజునే జగన్ చెప్పేసారు. “మీరు ఉండేది ఏడాదిన్నర మాత్రమే. తర్వాత మీలో 90 శాతం మందిని మార్చేస్తాను. జాగ్రత్తగా పనులు చేసుకోండి” అంటూ సూటిగా చెప్పేసారు. సో.. ఈ మాటలు ఆ మంత్రుల చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. అందుకే ఎవరి సీటు భద్రం చేసుకోడానికి వాళ్ళు రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. కానీ ఈ ట్రిక్స్ అన్ని జగన్ పులివెందులలో చిన్నప్పటి నుండి నేర్చుకున్నవే. కొందరి అనవసర భజనలు.., కొందరి అసందర్భ వ్యాఖ్యలు.., కొందరు మంత్రుల అవినీతి చరిత్ర మొత్తం జగన్ కి తెలిసేదే. సీఎం దగ్గర అటువంటి గట్టి వ్యవస్థ ఉంది. సో.., ఇప్పటికే 20 నెలలు ముగిసింది. మరో 10 నెలలు మాత్రమే మంత్రులు ఉండేది. ఆ తర్వాత చాలా మంది సీట్లకి ఎసరు తప్పదు. వారే ఎవరు అనేది ఎవరికీ వారికి అంతర్గత చర్చ నడుస్తుంది..!
ఇదీ చదవండి ;
45 ఏళ్ళ “ఈనాడు – రామోజీ”చరిత్రని తిరగరాసిన జగన్..!
వివాదాల్లో వీళ్ళు..! సైలెన్స్ గా వాళ్ళు..!!
ఈ 20 నెలల్లో మంత్రుల పనితీరు ఒక్కసారి సింపుల్ గా మదింపు చేసుకుంటే కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. కొందరు వివాదాల్లో ఉండగా., కొందరు తమ శాఖని అసలు పట్టించుకోలేదు.
* మొదటి విభాగంలో బాగా వివాదాల్లో ఉన్న మంత్రులను తీసుకుంటే..! కృష్ణ జిల్లాకి చెందిన తన శాఖపై కంటే ప్రత్యర్థులపైనే పట్టు ఎక్కువ. గడిచిన 20 నెలల్లో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లలో తన శాఖపై ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ మాట్లాడలేదు. అప్పుడు కూడా సబ్జెక్టు లేక అభాసుపాలయ్యారు. కానీ పాతిక సార్లుకి పైగా ప్రెస్ మీట్లలో టీడీపీని, చంద్రబాబుని కడిగేశారు. అదే సమయంలో జగన్ ని భజన చేశారు. మొత్తానికి వివాద మంత్రుల్లో ఆయనది మొదటి ర్యాంకు. ఇదే జాబితాలో నెల్లూరు జిల్లాకి చెందిన ఓ మంత్రి, కృష్ణా జిల్లాకే చెందిన మరో మంత్రి కూడా ఉన్నారు.
* ఇక అవినీతి మంత్రుల జాబితానే తీసుకుంటే… కర్నూలు జిల్లాకి చెందిన ఓ మంత్రి దీనిలో ముందున్నారు. శాఖపై సమీక్షించక, ఆధారాలతో సహా అవినీతితో దొరికిపోయి.. సరైన సమాధానం చెప్పుకోలేకపోయారు. అవినీతి మంత్రుల్లో చాలా మంది జాబితా ఉన్నప్పటికీ మీడియాలో బాగా ఫోకస్ అయ్యారు కాబట్టి ఈయనది మొదటి ర్యాంకు. ఇదే జాబితాలో పశ్చిమకి చెందిన ఓ మంత్రి, ప్రకాశం ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ఉన్నారు. ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి.
ఇదీ చదవండి ;
కొడాలి నానిని ఎవరు టార్గెట్ చేశారు..!? వైసిపిలో ఏం జరుగుతుంది..!?
* ఇక రాష్ట్రంలో అత్యంత కీలక శాఖ చూస్తున్న మహిళా మంత్రి ఆ శాఖపై పట్టు పెంచుకోలేకపోయారు. సమీక్ష లేదు, గట్టి చర్యలు లేవు. పవర్ చూపించడం లేదు. తన శాఖపై తనదైన ముద్ర వేయలేదు. గడిచిన 20 నెలల్లో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనల్లో ఆమె శాఖ వైఫల్యం ఉంది. వీటిపై ఆమె పూర్తిస్థాయిలో పని చేయలేదనే చెప్పాలి. సో.. సైలెంట్ గా ఉంటూ కేవలం పేరుకే మంత్రుల జాబితాలో ఈమె మొదటి స్థానం. ఇదే జాబితాలోకి పశ్చిమ గోదావరికి చెందిన ఓ మహిళా మంత్రి, విజయనగరం జిల్లాకి చెందిన మహిళా మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి వస్తారు.
* ఇక కొంచెం కొంచెం శాఖపై పట్టు ఉంటూ.. సబ్జెక్టు ఉన్న మంత్రులు కొద్దిమంది ఉన్నారు. వీళ్ళు అడపాదడపా సమీక్షలు, సమావేశాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. * ఇలా మంత్రుల జాబితా వారి పనితీరు, ప్రవర్తన వారీగా వేరు చేసుకుంటే జగన్ వీరిలో ఏ జాబితా వాళ్ళని పక్కన పెడతారు..? ఏ జాబితా వాళ్ళని ప్రమోషన్ ఇస్తారు అనేది సందేహమే. కానీ మార్పులు మాత్రం ఖాయమే. పైన చెప్పుకున్న పేర్లలో చాలా వరకు మాజీలు అవ్వడమూ ఖాయమే..!! ఇది కాకుండా మరో కీలక అంశం “ఇద్దరు అత్యంత సీనియర్ మంత్రుల” చుట్టూ తిరుగుతుంది. అదేమిటో తదుపరి కథనంలో చూద్దాం..!!