టీడీపీ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నట్లు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కరణం బలరాం షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి అయితే 10 నుంచి 12 మంది వస్తారు అన్న సంఖ్య అనే దాని విషయంలో క్లారిటీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే పార్టీ నాయకులతో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కరణం బలరాం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేరుతారన్న సమాచారం ఉందని దానికి కొంచెం టైం పడుతుంది అని తెలిపారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉన్నట్టుగా కరణం బలరాం వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
ఇదే తరుణంలో చంద్రబాబు పనితనానికి అదేవిధంగా జగన్ పనితనానికి చాలా తేడా ఉందని…. చంద్రబాబుతో ఎక్కువ కాలం ప్రయాణం చేశాం కాబట్టి ఇవి చెబుతున్నట్లు కరణం బలరాం తెలిపారు. నమ్ముకున్న వారికి న్యాయం చేసేది వైయస్ జగన్ అని, జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు మంచి సత్సంబంధాలు ఉండేవి అని అన్నారు. కాగా అంతా కూల్ అనుకున్న టైంలో కరణం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?