ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత సోము వీర్రాజు పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం బిజెపి పార్టీ వార్తల్లో ఉండేలా సరికొత్త రాజకీయ ఎత్తుగడలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులతో సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు మీరా నేనా అన్నట్టుగా ఉంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ విధంగానే మీడియాతో దూకుడుగా వ్యవహరించిన సోము వీర్రాజు కి మర్చిపోలేని దెబ్బ లాంటి సందర్భం తాజాగా ఎదురయ్యింది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
పూర్తి విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఉద్యమానికి సోము వీర్రాజు పిలుపునివ్వటం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు టైంలో కూడా హిందూ దేవాలయంపై దాడి జరిగాయని చెప్పుకొచ్చారు. ఇదే టైములో చంద్రబాబు కూడా ఇప్పుడు హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను ఖండించాలి అంటూ ట్విట్టర్లో బాబు కామెంట్ చేసినట్లు మీడియా మిత్రులు ప్రస్తావించడని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.
ఎక్కడో హైదరాబాదులో ఉండి మాట్లాడటం కాదు…. అలాంటి చంద్రబాబు ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, ఆయనకు మాట్లాడే అర్హత లేదు అనే రీతిలో సోము వీర్రాజు రెచ్చిపోయారు. ఇలాంటి తరుణంలో మీడియా ప్రతినిధులు మరి మీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కూడా హైదరాబాదులో ఉండే రాజకీయాలు చేస్తున్నారు కదా దానికి మీరేమంటారు? అంటూ కంగు తినిపించే రీతిలో సోము వీర్రాజు ని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక చిర్రెత్తిపోయారు.
వెంటనే మీడియా సమావేశం నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు. దీంతో మీడియాకే సమాధానం చెప్పలేని సోము వీర్రాజు రాబోయే రోజుల్లో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారు అనే విమర్శలు బిజెపి లోలోపల వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో కచ్చితంగా సోము వీర్రాజు కెరియర్లో ఈ సంఘటన మర్చిపోలేని దెబ్బ లాంటిదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.