NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ దక్షతకు అగ్నిపరీక్ష పెడుతున్న ఆ రెండు అంశాలు! వాట్ నెక్స్ట్?

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అతి కీలకమైన రెండు అంశాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కనుక మెతకవైఖరి అవలంబిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.కేంద్రం మెడలు వంచైనా ఆ రెండు అంశాలలో సానుకూల ఫలితాలను రాబడితేనే జగన్ కి భవిష్యత్తు ఉంటుందని వారు చెబుతున్నారు.ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ఆ రెండు అంశాలను జగన్ పక్కనబెడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు.అయితే ఆ రెండూ కూడా ఇప్పుడు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి.

 Those are the two things that are testing the efficiency of ys jagan
Those are the two things that are testing the efficiency of ys jagan

అందులో ఒకటైన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎప్పుడో తలుపులు మూసేసింది.కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ఎంపీలను అధిక సంఖ్యలో ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని అన్నది బహిరంగ ప్రకటన చేశారు.మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వైసిపి ఎంపీలు ఇరవై రెండు మంది గెలిచారు.సంఖ్యాబలం దృష్ట్యా లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైసిపి.అయినప్పటికీ వైసిపి ఎంపీలు గానీ జగన్ గానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయడం అటుంచి అసలు ఆ ఊసే ఎత్తటం మానేశారు.స్వాతంత్ర దినోత్సవ సందేశంలో జగన్ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినప్పటికీ ఆ తదుపరి ఫాలోఅప్ యాక్షన్ లేదు. హోదా వచ్చి ఉంటే కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి తరలి వచ్చి అనేక విధాలుగా ప్రయోజనం కలిగే అవకాశాలు ఉండేవి. ఇక తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే కేంద్రం పెద్ద మెలికే పెట్టి ఏపీ ప్రభుత్వం నెత్తిన గుదిబండ మోపింది.ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే ఇస్తామని, పునరావాస ప్యాకేజీ తో తమకు సంబంధం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది.

 Those are the two things that are testing the efficiency of ys jagan
Those are the two things that are testing the efficiency of ys jagan

పోలవరం ప్రాజెక్టు వ్యయం యాభై అయిదు వేల కోట్ల రూపాయలు కాగా కేంద్రం ఇస్తానంటోంది కేవలం ఇరవై వేల కోట్లు.మిగతా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సాధ్యమయ్యే పనికాదు.పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిది.దాన్ని పూర్తి చేయలేకపోతే భావితరాలవారు పాలకులను క్షమించరు.పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో జగన్ కూడా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని నానా మాటలు అన్నారు.ఇప్పుడు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ఏమీ చేయలేని పక్షంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు ఆయన తలదించుకోవాల్సి వస్తోంది.కేంద్రానికి అవసరమున్నా లేకున్నా మద్దతిస్తున్న వైసీపీ ఈ రెండు విషయాల్లో గట్టిగా పట్టుబట్టి ప్రధానిని ఒప్పించగలిగితేనే జగన్ తెలుగు ప్రజలకు ముఖం చూపించగలరని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!