టిడిపి పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గత కొంత కాలం నుండి సైలెంట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉంది అన్నట్లుగా టిడిపి పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. మరోపక్క బీజేపీ నేతలు త్వరలోనే టిడిపి పార్టీ నుండి చాలామంది బీజేపీలోకి వస్తున్నట్లు కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో ఇటీవల జరిగిన పార్లమెంటు సభ లో కూడా రామ్మోహన్ నాయుడు గతంలో మాదిరిగా యాక్టివ్ గా రాణించలేదు అన్న టాక్ ఉంది.
ముఖ్యంగా బాబాయి అచ్చెన్నాయుడు అరెస్ట్ వలన రామ్మోహన్ నాయుడు… ఈ విషయంలో పార్టీ సరైన రీతిలో రాణించ లేనట్లు భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో రామ్మోహన్నాయుడు అక్క ఆదిరెడ్డి భవాని కూడా పార్టీ మారటం గ్యారెంటీ అనే టాక్ వచ్చింది. ఆదిరెడ్డి భవాని కూడా ప్రస్తుతం తన నియోజకవర్గంలో గతంలో మాదిరిగా రాణించటం లేదు అనే టాక్ వస్తుంది. ఇదే తరుణంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా సైలెంట్ అయినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
గతంలోనే గల్లా జయదేవ్ బిజెపిలోకి వెళ్లే ప్రయత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ముగ్గురు ఎంపీలలో ఒక ఎంపీ కేశినేని మాత్రమే వైసీపీ ప్రభుత్వం పై చాలా దూకుడుగా విమర్శలు చేస్తు వస్తున్నారు. మిగతా ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు సైలెంట్ అవ్వటం ఇప్పుడు టిడిపి పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని టీడీపీ హైకమాండ్ చెప్పినట్టు కాక ఇష్టానుసారంగా వ్యవహరించటం ఎక్కువైపోయింది అని పరిశీలకుల మాట.