బిజెపి పార్టీ ఎప్పటినుండో దక్షిణాదిలో అడుగు పెట్టాలని చూస్తున్న కర్ణాటకలో మినహా ఎక్కడా కూడా బలపడిన సందర్భాలు లేవు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సరికొత్త వ్యూహాలతో సన్నద్ధమవుతున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షులను మార్చడం బట్టి అర్థమవుతుంది.
ముందుగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కరోనా వైరస్ రాకముందు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నీ నియమించిన బీజేపీ ఏపీలో ఇటీవల కన్నా లక్ష్మీనారాయణను పక్కకు పెట్టి ఆ ప్లేస్ లోకి సోము వీర్రాజు కి అప్పగించడం అందరికీ తెలిసిందే. తెలంగాణలో దూకుడుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు ఏపీలో కూడా అదే రీతిలో వ్యవహరించడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వైరస్ అవుతున్నాయి.
దీనిలో భాగంగా జగన్ మీద కి మోడీ త్రిశూల వ్యూహం రెడీ చేసినట్లు బిజెపి పార్టీలో టాక్. పూర్తి విషయంలోకి వెళితే బిజెపి లక్ష్యాలు గమనిస్తే రాబోయే 2022 నాటికి టిడిపిని బలహీనపరచి ఆ పార్టీలో ఉండే బలమైన కాపు, కమ్మ నాయకులను బీజేపీలోకి జాయిన్ చేసుకోవాలని, ఆ తరువాత 2023, 2024 సరిగ్గా ఎన్నికల సమయంలో పాదయాత్ర పవన్ కళ్యాణ్ చేత చేయించి, బిజెపి- జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు, అదే రీతిలో జిల్లాల వారీగా కూడా బస్సుయాత్ర పవన్ మరియు బిజెపి కీలక నాయకుల చేత చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.
సో బిజెపి వ్యూహాలు చూస్తే రెండు దశలలో బీజేపీ ప్లాన్ చేసింది. మొదటి దశ గమనిస్తే టిడిపిని బలహీనపరచడం. రెండోది జగన్ కి ఆల్టర్నేట్ గా 2024 జగన్ మీద పోటీకి వెళ్ళటం. అంతిమంగా 2024 ఎన్నికలకు ముందు జగన్ ని దెబ్బ కొట్టడం. సో దానికి సంబంధించి ఆయుధం త్రిశూలం ఎత్తే పోటుగాడు గా పవన్ ని బిజెపి రెడీ చేస్తున్నట్లు ఏపీ రాజకీయాలలో అంతర్గతంగా వినబడుతున్న టాక్.