హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. తెలంగాణా రాష్ట్ర సమితి నుండి శాసన మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవ రెడ్డి కాగ్రెస్ పార్టీలో చేరారని తెరాసా నేతలు మండలి చైర్మన్ స్వామి గౌడ్కు ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించిన కొన్ని అధారాలను కూడా చైర్మన్కు సమర్పించడంతో వాటిని పరిశీలించి ఆయన నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీలు తమ వాదనలను చైర్మన్కు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న చైర్మన్ ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటువేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు ఆయన తెలిపారు.
అనర్హతకు గురైన యాదవ్ రెడ్డి ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయ్యారు. భూపతిరెడ్డి నిజామాబాధ్నుంచి స్థానిక సంస్ధల కోటాలో, గవర్నర్ కోటాలో రాములు నాయక్లు ఎన్నికయ్యారు.
టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన కొండా మురళి ఇదివరకే మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
previous post
next post