డబ్బు.., హోదా.., కుటుంబం.., కామన్ సెన్స్.. ఈ నాలుగు మనిషి జీవితానికి నాలుగు స్తంభాలు.. .! జీవితాన్ని శాసించేవి, నిలబెట్టేవి ఇవే..! కానీ ఈ నాలుగు స్తంభాలను పునాదిలా నిలబెట్టేది మాత్రం టైం…! అవును టైం బాగుంటే అంతా బాగుంటుంది, టైం బాగోకపోతే ఆలోచనలు బాగోవు, జీవితం బాగోదు..! అందుకే “కాలం కలిసి రావట్లేదు” అంటుంటారు..! ఇక ఈ టైం మన రాష్ట్ర నేతల జీవితంలో బాగా ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం..!!
గోదావరి పుష్కరాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొదటి రోజున ఆ సీఎం చంద్రబాబు, కుటుంబంతో సహా పుష్కర స్నానం చేస్తున్నారని లక్షలాది భక్తుల్ని ఆపేసారు. సుమారుగా 45 నిమిషాల పాటూ బాబు కుటుంబం ప్రోటోకాల్ అంటూ ఆపేసారు. ఆయన గారి స్నానం అయ్యాక, భక్తి ముగిశాక.., ఉన్న జనాలను ఒకేసారి వదిలేశారు. ఉన్నపళంగా అందరూ ఒకేసారి హద్దులు దాటుకుని వెళ్లడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు.
ఈ పాపం ఎవరిది..? పుష్కరాల్లో లక్షలాది భక్తుల్ని ఆపేసి స్నానం చేస్తున్న చంద్రబాబుదా..? లక్షలాది భక్తుల్ని మరో ప్రత్యామ్నాయం చూపకుండా వేచి చూసేలా చేసిన అధికారులదా..? ఒకేసారి జనాల్ని వదిలేసి నియంత్రించలేని పోలీసులదా..? త్వరగా పుష్కర స్నానం చేసేయాలని తొక్కిసలాడుకున్న జనాలదా..? దీనికి సమాధానం ఉండదు. ఒక్కటి మాత్రం నిజం. టైం బాలేదు. నాడు బాబుకి, ఆ అధికారులకి, ఆ జనాలకి, ఆ పోలీసులకు టైం బాలేదు. ఉద్దేశ పూర్వకంగా ఎవరూ అలా చేయరు. కొన్ని సమయాల్లో ఊహించని ఉపద్రవాలు ముంచుకొస్తాయి. అలా అది చంద్రబాబుకి బ్యాడ్ టైం గా నిలిచిపోతుంది. ఆయన జీవితకాలం ఈ మచ్చ గుర్తుంటుంది..!!
నిన్న విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి. జనాలకు ఎవ్వరికీ ఏం కాలేదు. కొందరు అధికారులకు మాత్రమే పాక్షికంగా గాయాలయ్యాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్ అప్పుడే వచ్చారు. సీఎం వస్తున్నారని జనాలను ఆపేసారు. సుమారుగా 50 నిమిషాల పాటు లైన్ కదలనీయలేదు. ఇదే సమయంలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఒక వేళ జనాలను వదిలేస్తే.., జగన్ రాకుంటే.., జనాలను నియంత్రించకుంటే ఆ సమయంలో అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. కానీ.. జగన్ వచ్చారు, పోలీసులు జనాలని ఆపారు.., జనం లేని వేళన కొండా చరియలు కూలాయి. ఒక్క ప్రాణమూ పోలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది గుడ్ టైం కదా..?
నిజమే కదా..! ఇప్పుడు అర్ధమయిందిగా.., టైం ఎలా శాసిస్తుందో. రెండూ ఒకే తరహా సంఘటనలు. సీఎం వచ్చారు, భక్తులు వెయిటింగ్ లో ఉన్నారు. పోలీసులు కాపలా ఉన్నారు. అక్కడ వెయిట్ చేయడం వలన విసిగిన జనం ఒకేసారి తొక్కిసలాటకు గురయ్యారు..! ఇక్కడ వేచి చుసిన జనం కొండ ప్రమాదం నుండి బయటపడ్డారు. చంద్రబాబుకి అప్పుడు టైం బాలేదు. అనేక వేదపండితులు కూడా అదే చెప్పారు. ఇప్పుడు జగన్ టైం నడుస్తుంది. అదే తేడా..!!