Tirupathi : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి ఉప ఎన్నిక షురూ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలు జరగటం వాటి ఫలితాలు రావటం మాత్రమే కాక అధికారపార్టీ వైసిపి భారీ స్థాయిలో విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక తేదీ కూడా వచ్చేసింది. ఏప్రిల్ 17 వ తారీకు నాడు తిరుపతి ఉప ఎన్నిక షురూ అయింది.
దీంతో ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలు చేయటానికి మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. టిడిపి పార్టీ నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి దిగుతుండగా మరోపక్క జనసేన బీజేపీ కూటమి నుండి.. బిజెపి పార్టీకి చెందిన క్యాండెట్ ఎన్నికల్లో పోటీ చెయ్యనున్నారు. దీంతో వైసిపి పార్టీ నుండి ఎవరు పోటీకి దిగుతారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా నెలకొని ఉంది. ఉప ఎన్నిక కావటంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో బిజీ కాబోతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికల్లో కనీసం ప్రచారం కి రాకుండా.. ఒక్క మీడియా సమావేశం నిర్వహించకుండా, నాకు ఓటేయండి అని అడగకుండా.. మొత్తం క్లీన్ స్వీప్ చేసిన జగన్ .. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.