Tirupathi By election: తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక సమీపిస్తోంది. మూడు రోజుల్లో పోలింగ్ ఉంది. ప్రధాన పార్టీల ప్రచారం రేపటితో ముగియనుంది. ప్రచారం చివరి అంకంలో టీడీపీపై రాళ్లదాడి అనీ.., బీజేపీ నకిలీ ఓట్లు అని.., రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా తిరుపతి ఉప ఎన్నిక వేడెక్కింది. నిజానికి మొదట ఏకపక్షమే అనుకున్న ఈ ఉప ఎన్నిక గట్టిపోటీగా మారింది. ఈజీగా వైసీపీ గెలుపు అనుకున్న స్థానం కాస్తా.. గెలుపు ఖాయమే కానీ మెజారిటీ అనుమానం అనే వరకు వచ్చింది. దీనికి కారణాలేంటి..!? తిరుపతి పరిధిలో ఏ పార్టీ అవకాశాలు ఎలా ఉన్నాయి..? ఆ పార్టీల ప్రచారం ఎలా సాగింది..!? అనేది ఓ సారి పరిశీలిద్దాం..!!
Tirupathi By election: వైసీపీ ఓట్లు – పాట్లు – జగన్ ఫోటోనే ఆధారం..!!
అధికార వైసిపికి ఈ ఎన్నిక ఏకపక్షమే.. కనీసం 4 లక్షలు మెజారిటీ అనుకున్నారు. మూడు వారాల కిందటి వరకు అదే పరిస్థితి ఉండేది. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. మిగిలిన మూడు చోట్ల కూడా మంచి ఓటు బ్యాంకు ఉంది. 2019 లో మొత్తం 7 . 22 లక్షల ఓట్లు వచ్చాయి. 2 . 28 లక్షల ఓట్ల ఆధిక్యత సాధించారు. ఈ సారి కచ్చితంగా 8 . 25 లక్షల ఓట్లు వస్తాయి. మెజారిటీ కూడా అప్పటి కంటే లక్షన్నర ఎక్కువ వస్తుంది అని లెక్కలేసుకుంటున్నారు. కానీ టీడీపీ కోలుకున్నట్టు కనిపించడం.. టీడీపీ ముఖ్యులు కూడా అక్కడే తిష్ట వేయడంతో ఆ పార్టీపై ఫోకస్ పెరిగింది.
* తిరుపతి ఎంపీ పరిధిలో జగన్ ఫోటో.. ఆయన పాలన.. ఆయన సంక్షేమ పథకాలే వైసిపికి శ్రీరామరక్ష.. జగన్ ప్రచారానికి రాకపోయినప్పటికీ ఆయనే ఇక్కడ బ్రాండ్. సో.. వైసీపీ ఆ ఓట్లపైనే ఆధారపడింది. అన్నీ కలిసొస్తే.. ప్రచారం, ప్రలోభం ఫలిస్తే వారు ఆశిస్తున్నట్టు నాలుగు లక్షల మెజారిగి సాధించగలరు.. ఆ సెంటిమెంట్ పండకపోతే.. టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తే వైసీపీ మెజారిటీ లక్షన్నరకి పడిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు.
టీడీపీ గట్టి పోటీ.. దూసుకొచ్చిన విశ్వాసం..!!
మూడు వారాల కిందటి వరకు తిరుపతి ఎంపీ స్థానంలో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని.. ఇంతగా ప్రచారం.., ప్రయత్నాలు చేస్తుందని ఏ ఒక్కరూ అనుకోలేదు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఊహించలేదు. కానీ టీడీపీ వ్యూహం మార్చింది. తిరుపతి ఉప ఎన్నికను తాము ఎంత సీరియస్ గా తీసుకుంటున్నామో.. అది తమకు ఎంత కీలకమో ఆ పార్టీ చాటింది. రాష్ట్రం మొత్తం మీద టీడీపీకి ఉన్న పేరు మోసిన నేతలు, ఎమ్మెల్యేలు, మాజీలు అందర్నీ మోహరించింది. లోకేష్ 12 రోజులూ.. చంద్రబాబు వారం రోజులూ అక్కడే తిష్ట వేసి ప్రచార బాధ్యతలు చూసారు. మొత్తానికి టీడీపీ కార్యకర్తల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఇప్పుడు తిరుపతి ఏమీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఈ ఫలితంగా గూడూరు, శ్రీకాళహస్తి, సర్వేపల్లి, సూళ్లూరుపేట వంటి నియోజకవర్గాల్లో వైసిపికి గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యతని బాగా తగ్గించామని ఆ పార్టీ చెప్పుకుంటుంది.
* టీడీపీ ప్రచారాలు, ప్రయత్నాలు, ప్రలోభాలు పూర్తిగా ఫలిస్తే టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన కంటే 50 వేలు ఓట్లు ఎక్కువ రావచ్చు. అంటే మొత్తం అయిదున్నర లక్షలు ఓట్లు రావచ్చు. లేకపోతే టీడీపీని లెక్కచేయక.. చంద్రబాబు ప్రయత్నాలను ఓటర్లు కరుణించకపోతే మాత్రం 4 లక్షలకు పైచిలుకు తేడాతో ఓటమి ఖాయమే. 2019 ఎన్నికల కంటే 25 వేలు ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే టీడీపీ గాలి మారినట్టే.
బీజేపీ.. స్వీయ బల పరీక్ష..!!
ఇక బీజేపీ ఈ ఎన్నిక ద్వారా ఒక బల పరీక్ష చేసుకుంటుంది. తమ రాజకీయ భవిష్యత్తుపై పరీక్ష రాస్తుంది. వాళ్ళు అనుకున్న ఓట్లు వస్తే ఏపీలో బీజేపీ రాజకీయం మారుతుంది. రాకపోతే ఏపీలో బీజేపీ మరింత దిగజారుతుంది. మొత్తానికి ఈ ఎన్నిక బీజేపీకి, ఏపీలో ఆ పార్టీ భవిష్యత్తుకి, జనసేనతో పొత్తుకు అన్నిటికీ పరీక్ష.. బీజేపీ కి 2019 ఎన్నికల్లో 21 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేనతో పొత్తు.. మోడీ పాలన.. బీజేపీ పేరు ప్రతిష్టలు.. కేంద్రంలో అధికారం.. మంచి ఉన్నత విద్యావంతురాలైన అభ్యర్థి.. ఇవన్నీ కలిసొస్తే బీజేపీకి కనీసం లక్షన్నర ఓట్లు వస్తాయని ఆ పార్టీ పెద్దలు లెక్కేస్తున్నారు. అలా వస్తే మాత్రం ఏపీపై ఆ పార్టీకి ఫోకస్ పెరుగుతుంది. జనసేనతో బంక మరింత స్ట్రాంగ్ గా కుదురుతుంది. రెండూ కలిసి ఎదిగే ప్రయత్నం చేస్తాయి. ఒక నమ్మకం పెట్టుకుంటాయి. ఒకవేళ బీజేపీకి 50 వేలు ఓట్లుకి పరిమితమైతే .. బీజేపీ ఇక్కడ టీడీపీ లేదా వైసీపీతో కలిసి రాజకీయం మొదలు పెడుతుంది. ఒంటరిగా.. జనసేనతో ఎదగలేమని.. తమను ఉనికి లేదని నిజాన్ని గ్రహిస్తుంది.. సో… ఈ ఎన్నిక బీజేపీ అసలు బలానికి పరీక్ష కానుంది..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?