కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోపక్క మాత్రం కేంద్రంలో ఎటువంటి కదలికా కనబడటం లేదు. ఇదే తరుణంలో దేశవ్యాప్తంగా విపక్షాలు కేంద్రంపై మండిపడుతున్నాయి.
కార్పొరేటర్లకు మేలు చేకూర్చడానికి మోడీ సర్కార్ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దేశంలో రైతుల పరిస్థితి ఇలా ఉంటే త్వరలో డాక్టర్లు కూడా రోడ్డు పైకి రావటానికి డిసైడ్ అయ్యారు. మేటర్ లోకి వెళితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) కీలక నిర్ణయం ప్రకటించింది.
ఫిబ్రవరి ఫస్ట్ నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సామూహికంగా డాక్టర్లు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు స్పష్టం చేసింది. ముందుగా ఈ విషయాన్ని మోడీ కి లెటర్ ద్వారా తెలియజేస్తామని భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) తెలిపింది. ఆయుష్మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ అశాస్త్రీయంగా ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ‘సేవ్ హెల్త్కేర్ మూమెంట్’ ను ప్రారంభించబోతున్నట్లు భారతీయ వైద్య సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.