కోల్కత్తా, జనవరి 19: యునైటెడ్ ఇండియా పేరుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి దేశ వ్యాప్తంగా 20మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. బ్రిగేడ్ పరెడ్ గ్రౌండ్కు పెద్ద సంఖ్యలో నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలతో నిండిపోయింది. మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, అరణ్ శౌరిలతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక ముఖ్యమంత్రులు అరవింద్ క్రేజీవాల్, చంద్రబాబు నాయుడు, హెచ్డి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు షరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గీగోంగ్ అపాంగ్, సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్టు పార్టీ అధినేత శరత్ పవార్, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, లోక్ తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యూదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ర్యాలీకి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హజరుకాలేదు. మమతా బెనర్జీకి తన మద్దతు తెలియజేస్తూ ఆయన సందేశం పంపించారు. ఆయన తరుపు లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ మను సంఘ్వీ పాల్గొంటున్నట్లు సమాచారం.
బిఎస్పి అధినేత్రి మాయావతి తరపున ఆ పార్టీకి చెందిన నేత సతీష్ చంద్ర మిశ్రా హజరైయ్యారు.
శక్తివంతమైన, ప్రగతిశీలమైన యునైటెడ్ ఇండియా నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడానికి వచ్చిన జాతీయ నాయకులు, మద్దతుదారులకు మమతా బెనర్జీ ఘన స్వాగతం పలికారు.