తెలుగు, తమిళ సినిమాల్లో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ త్రిషా.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 23 ఏళ్లు అయినప్పటికీ తనదైన అందంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.. అయితే ఇటీవల త్రిషకు టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇదిలా ఉంటే త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా కెరీర్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది..ఈక్రమంలో తనపై వస్తున్న రూమర్స్ పై త్రిష క్లారిటీ ఇచ్చారు..
ఆ ప్లానే లేదు:త్రిష
తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె రాజకీయ ప్రవేశంపై ప్రశ్న ఎదురైంది. దీంతో తన రాజకీయ ఎంట్రీపై త్రిష్ స్పష్టత ఇచ్చారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కడ నుంచి పుడుతాయో అర్థం కావట్లేదని, పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం లేదని తెలిపారు. అసలు తనకు రాజకీయాల్లో ప్రవేశించాలన్న ప్లానే లేదని సమాధానమిచ్చారు త్రిష..
ఇక త్రిష్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై ఆ పార్టీ కూడా స్పందించింది. త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఎలాంటి చర్చ జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ చెప్పారు. త్రిష్ పొలిటికల్ ఎంట్రీపై జరుతున్న ప్రచారం నిజమో? కాదో తనకు తెలియదన్నారు. త్రిష పార్టీలో చేరినంత మాత్రాన.. పార్టీ బలపడదని, ఆమెకు పెద్ద స్పందన కూడా ఉండదని అన్నారు. ఒకవేళ ఆమె పార్టీలో చేరాలని భావిస్తే తప్పకుండా స్వాగతిస్తామని పేర్కొన్నారు.
హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిషకు అభిమానులు బాగానే ఉన్నారు. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదన్న క్లారిటీ రావడంతో వారు కొంచెం అసంతృప్తి చెందారు. త్రిష సరైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అభిమానులు అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!