Nagarjunsagar by election: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ కి ఓటర్లు భారీ ఎత్తున ఉదయం నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 41 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లు ఆ తర్వాత గంటపాటు కరోనా పేషెంట్ లకు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది.
ఉదయం నుండి సాగర్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటు వినియోగించుకోవడానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబసమేతంగా ఇబ్రహీంపేట లో ఓ స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 46.33 శాతం ఓట్లు రాబట్టింది. జరుగుతున్న ఈ ఉప పోరులో టిఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాలు మే 2న రానుంది.