తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నేతగా రేవంత్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా గాని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కి వచ్చినా గానీ ఎక్కడా కూడా దూకుడు తగ్గకుండా రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తూ రాణించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి విమర్శించిన విధంగా మరొక పొలిటిషన్ విమర్శించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం జరుగుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ పై మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కెసిఆర్ పై విధంగా ఏ ఒక్క విషయాన్ని వదలకుండా కథలు సామెతలు చెబుతూ రేవంత్ రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేక సార్లు ఈ విధంగా విమర్శలు చేసిన పెద్దగా స్పందించలేదు కేసీఆర్, కేటీఆర్. కారణం చూస్తే అనవసరంగా రేవంత్ రెడ్డి విమర్శలకు స్పందిస్తే అతని పెద్ద నాయకుడిని చేసినట్లవుతుందని కెసిఆర్ ఆంతర్యం.
కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని… ఇక రేపో మాపో కాషాయ కండువ కూడా కప్పుకోవడం గ్యారెంటీ అని కేటీఆర్ జోస్యం చెప్పటంతో ఈ కామెంట్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా అసలు నా దృష్టిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడే కాదని కేటీఆర్ కొట్టిపారేశారు. ఇదే క్రమంలో సిద్దిపేటలో బిజెపి నేతల వ్యాఖ్యలపై అదేవిధంగా ప్రధాని మోడీ పై షాకింగ్ కామెంట్లు చేశారు కేటీఆర్. తమ ఓపిక నశిస్తే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలాంటివైనా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.