టిఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. గురువారం సాయంత్రం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ఒకేసారి 17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు.
చివరి నిమిషంలో పార్టీలో చేరి నామా నాగేశ్వరరావు, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, వెంకటేష్ నేతకాని కూడా బీఫాంలు అందుకున్నారు.
టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థులు వీరే:
- నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత
- కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్
- మహబూబ్నగర్ – మన్నె శ్రీనివాస్రెడ్డి
- ఖమ్మం – నామా నాగేశ్వరరావు
- చేవెళ్ల – రంజిత్ రెడ్డి
- హైదరాబాద్ – పుస్తె శ్రీకాంత్
- సికింద్రాబాద్ – తలసాని సాయికిరణ్ యాదవ్
- మల్కాజిగిరి – మర్రి రాజశేఖర్ రెడ్డి
- ఆదిలాబాద్ – గోడెం నగేశ్
- పెద్దపల్లి – నేతకాని వెంకటేష్
- మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి
- జహీరాబాద్ – బీబీ పాటిల్
- వరంగల్ – పసునూరి దయాకర్
- మహబూబాబాద్ – మాలోతు కవిత
- నల్గొండ – వేమిరెడ్డి నర్సింహారెడ్డి
- భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
- నాగర్కర్నూల్ – పోతుగంటి రాములు