Telangana : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు చోటు చేసుకున్న సంఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. పట్టభద్రుల ఎన్నికలు కావడంతో .. ఈ ఎన్నికలలో పట్టభద్రుల మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి తరుణంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ దొంగ ఓటు వేయటం మాత్రమేకాక అడ్డం గా దొరికిపోయింది.
హైదరాబాద్- రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకున్న తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న..తన తోటి కోడలు పేరుతో నమోదు అయినా ఓటు హక్కును వినియోగించుకోవడం తో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ..మున్సిపల్ చైర్ పర్సన్ దొంగ ఓటు వేసినట్లయింది. దీంతో కొంత మంది ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ విచారణ చేపట్టడంతో ..తాటికొండ స్వప్న దొంగ ఓటు వేసినట్లు అడ్డంగా బుక్ అయ్యింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీలు అదేవిధంగా తెలంగాణ జన సమితి నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి స్వప్న రాజీనామా చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.