తాజాగా ట్రంపు సర్కార్ తమ దేశ పౌరుల కోసం సరికొత్త గా సవరించిన ట్రావెల్ అడ్వైజర్ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అందులో అమెరికన్లు ఇండియాకు వెళ్లొద్దని సూచించింది. పూర్తి విషయంలోకి వెళ్తే మహమ్మారి కరోనా వైరస్ వలన ప్రపంచం అతలాకుతలం అవుతున్న తరుణంలో చాలా దేశాలు లాక్డౌన్ అయిపోయాయి. వైరస్ వ్యాప్తి కారణంగా పలు దేశాలు ఆంక్షలను విధించడం జరిగింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల పై లాక్ డౌన్ అమలు చేసిన దేశాలు ఆంక్షలు విధించాయి.
ఇదే కోవలో అమెరికా కూడా విధించడం జరిగింది. అయితే లాక్ డౌన్ చేపట్టినా గాని వైరస్ నీ ఏ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉండటంతో, చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి పోవడంతో…లాక్ డౌన్ ఎత్తివేస్తూ కొత్త సవరణలతో ఆంక్షలతో కూడిన రూల్స్ తో విదేశీయులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. ఈరీతి గానే ట్రంప్ సర్కార్ గతంలో జారీ చేసిన ట్రావెల్ అడ్వైజర్ ని సవరించింది.
తాజాగా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజర్ లో డ్రాగన్ కంట్రీ మరియు ఇండియా సహా మరో 50 దేశాలను లెవల్-4 కేటగిరీలోనే కొనసాగించింది. దీని ప్రకారం.. భారత్, చైనా సహా లెవల్-4 కేటగిరీలో ఉన్న దేశాలకు ప్రయాణం చేయొద్దని.. ట్రంప్ సర్కార్ అమెరికన్లకు సూచించింది. Level 4 కేటగిరి లో ఉన్న దేశాలకు వెళితే, కరోనా కారణంగా సరిహద్దు మరియు విమానాశ్రయాల మూసివేత, ప్రయాణ ఆంక్షలు, స్టే హోం ఆదేశాలతోపాటు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్లకు ట్రంప్ సర్కార్ పేర్కొంది.