ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంటేనే ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి కదా..? అలాంటిది ఒక దేశం గురుంచి మాట్లాడుతుంటే ఇంకేంత జాగ్రత పడాలి..? ఆ మాటాలు ఏదో ఒక సాధారణ వ్యక్తి మాట్లాడితే పట్టించుకోమేమో కానీ.. ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడితే..? ఆయనను ఏమనాలి అంటూ పలువురు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ మాటలు అంది ఎవరో కాదు.. మన మిత్ర దేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈయనకు నోటి దురుసు ఎక్కువే కానీ మరీ ఇంతలా ఉంటే కష్టం అని పలువురు మండిపడుతున్నారు. రోజుకో రకంగా ఆయన మీద విమర్శలు వస్తున్నా.. మళ్లీ ఇలా మాట్లాడటం ఏంటని, ఇలా మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.
నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన చివరి ప్రెసిడెన్సియల్ డిబెట్ లో ఆయన మాట్లాడుతూ.. ఇండియాను మురికిదేశమని అన్నారు. ఇండియాలో గాలి నాణ్యత చాలా మురికిగా ఉందని ఆరోపించారు. భారత్, రష్యా, చైనా దేశాల్లో గాలి నాణ్యత ఎంత మురికిగా ఉందో చూడండి అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆయన మీద పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మూడో డిబేట్ జరిగింది. ఇందులో ఇద్దరు పర్యావరణ మార్పులపై మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్పై అక్కసును బయటపెట్టారు. భారత్ పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని ఆరోపించారు. భారత్ మురికి దేశమంటూ ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై డెమొక్రటిక్ నేత జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రదేశాలతో అలా మాట్లాడడం సరికాదని తెలిపారు. వాతావరణ మార్పు సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని తెలిపారు. వాటిని పరిష్కరించే మార్గం చెప్పాలికానీ ఇలా అనడం సబబు కాదని తెలిపారు. ఇండియాతో అమెరికా భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.