Telangana : తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితమే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం జరిగింది. దీంతో టిఆర్ఎస్ శ్రేణులలో టెన్షన్ నెలకొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల సోమేష్కుమార్ కరోనా నియంత్రణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇదే తరుణంలో నిన్న కేసీఆర్ తో కూడా సమావేశమయ్యారు. అంతమాత్రమే కాకుండా మొదటి డోస్ కరోనా టీక కూడా తీసుకున్నారు. ఇంతలోనే ఆయన కరోనా బారిన పడటంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. రోజు రోజుకి తెలంగాణలో కూడా వైరస్ విజృంభణ భారీగా ఉండటంతో కొత్త కేసులు బయటపడటంతో ..ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధనలు తీసుకుని రీతిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బహిరంగ ప్రదేశాలు మరియు వర్క్ ప్లేస్ లో మాస్క్ తప్పనిసరి చేయటం మాత్రమే కాక ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాలు నిషేధించడం జరిగింది. ర్యాలీలు మరియు యాత్రలు ఎటువంటివి కూడా చేయకుండా ప్రజలు గుంపు గా ఉండకుండా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.