2019 సార్వత్రిక ఎన్నికలలో నే దాదాపు టిడిపికి కంచుకోటగా ఉండే నియోజకవర్గాలలో జగన్ తన పార్టీ జెండాను ఎగరవేశారు. చాలా నియోజకవర్గాలలో టిడిపి పార్టీ నాయకులకు తిరుగులేదు అన్న వారిని సైతం గత సార్వత్రిక ఎన్నికలలో మట్టికరిపించారు. పరిస్థితి ఇలా ఉండగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ టిడిపి పార్టీ కి పునాదిగా ఉండే ఓటు బ్యాంకు బీసీలను ఇప్పటికే తన సంక్షేమ పథకాలతో కొద్దికొద్దిగా ఆకర్షిస్తూ వస్తున్నారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ ఏడాది పరిపాలనలోనే చాలా బీసీ సామాజిక వర్గాలకు మేలు జరిగినట్లు ఆ వర్గాల ప్రజలు భావిస్తున్నారట.
దీంతో తాజాగా బీసీల లో వైసీపీ కి గతంలో కంటే ఆదరణ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి పార్టీలో కీలకమైన బీసీ కంచుకోట నియోజకవర్గాలపై అదిరిపోయే స్కెచ్ తో జగన్…. సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేయనున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే టీడీపీకి పూర్తిగా బీసీ సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి జగన్ అండర్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్లు టాక్. ఇప్పటికే సంక్షేమ పథకాలతో బీసీ సామాజిక ప్రజలను తనవైపు తిప్పుకున్న జగన్.. .. టీడీపీ బీసీ కంచుకోట నియోజకవర్గాలలో ఉండే నాయకులను కూడా వైసీపీలో చేర్చుకోవడానికి రెడీ అయ్యారట.
దీనిలో భాగంగానే విశాఖ ప్రాంతానికి చెందిన బీసీ ఎమ్మెల్యే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ తో ఈ కార్యక్రమానికి జగన్ నాంది పలికినట్లు టాక్ వస్తోంది. ఇప్పటిదాకా వైసీపీ పార్టీలోకి వచ్చిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అగ్రకులాలకు చెందినవారే కావడం తో చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే పార్టీ నుండి గోడ దూకటంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. ఇంకా రాబోయే రోజుల్లో ఇదే జరిగితే పూర్తిగా బీసీలు టీడీపీకి దూరం అవడం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు.