TTD : రిటైర్డ్ అయిన అర్చకులు మళ్లీ వీధుల్లోకి జాయిన్ అయ్యేవిధంగా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా అదేవిధంగా అర్చకులుగా సేవలు అందించిన వారు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరూ తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ పేర్కొన్నది. దీంతో గతంలో ప్రధాన అర్చకులు గా పనిచేసిన రమణదీక్షితులు తిరిగి ఆయన స్థానంలో యధావిధిగా ఆలయప్రవేశం చేయనున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఉన్న వారు ఏం చేస్తారు అన్నది.. ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. వయోపరిమితి పేరుతో గతంలో రిటైర్ అయిన వారిని తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ తీసుకోవటం పట్ల మాజీ అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.