అమరావతి: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించిందని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. టిటిడి డిఈఓగా క్రిస్టోఫర్ను నియమించారంటూ తప్పుడు వార్తను టీవీ 5 ఛానెల్ తన వెబ్సైట్లో పెట్టిందని సుబ్బారెడ్డి అన్నారు. ఆ వెబ్సైట్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామీ, కేసు కూడా పెడతామని సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని సుబ్బారెడ్డి విమర్శించారు.
జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యాభై రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిందని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వ్యవహరిస్తున్నారని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు.
టిటిడిలో విఐపి సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను వారు స్వాగతించలేకపోతున్నారని సుబ్బారెడ్డి అన్నారు. దేవుడు ముందు అందరూ సమానులే అని తాము నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నాని సుబ్బారెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారనీ, ఇలా విషప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని సుబ్బారెడ్డి హెచ్చరించారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?