(న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుండి ప్రముఖులు, సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు వైసీపీ పార్లమెంట్ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉభయ సభలకు హాజరయ్యే సభ్యులు తప్పని సరిగా కరోనా నెగిటివ్ రిపోర్టులు సమర్పించాలని లోక్ సభ కార్యదర్శి గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్, రాజ్యసభ సభ్యుల కోసం పార్లమెంట్ ఆవరణలో మూడు కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎంపి గొడ్డేటి మాధవి జ్వరంతో బాధపడుతుండగా వైద్యాధికారులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. అయితే చిత్తూరు ఎంపి రెడ్డప్పకు ఎటువంటి లక్షణాలు లేకున్నాకరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆయనను హోమ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఈ ఇద్దరు ఎంపిలకు కరోనా సోకడంతో సమావేశాలకు హజరుకాలేకపోయారు.