కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిజెపి షాక్ ఇవ్వడం ప్రారంభించింది. మంగళవారం ఇద్దరు టిఎంసి ఎమ్మెల్యేలు, ఒక సిపిఎం ఎమ్మెల్యేతో పాటు 50మంది టిఎంసి కౌన్సిలర్లు తృణమూల్ పార్టీని వీడి బిజెపిలో చేరారు.
టిఎంసి బహిష్కృత నేత ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాంగ్షు రాయ్తో పాటు మరో టిఎంసి అసమ్మతి ఎమ్మెల్యే, సిపిఎం ఎమ్మెల్యే ఒకరు బిజెపిలో చేరారు.
న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ సమక్షంలో వీరంతా బిజెపిలో చేరారు.
పశ్చిమ బెంగాల్లో ఏడు విడతలు పోలింగ్ జరిగినట్లే ఏడు విడతల్లో బిజెపిలో చేరికలు ఉంటాయనీ, నేడు జరిగింది మొదటి దశ మాత్రమేనని కైలాష్ విజయవర్గీయ అన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో ప్రదాని మోది 40మంది టిఎంసి ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం విదితమే.