మాజీ లోక్ సభ ఎంపీ, టాప్ రాజకీయ విశ్లేషకుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్.. జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కు రాసిన వివాదాస్పద గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముందు నుండి జగన్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్న ఉండవల్లి ఈ మధ్యకాలంలో అతని నిర్ణయాలను బాగా తప్పుపడుతున్నారు.. ఇదే క్రమంలో ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటో చూద్దాం…
ఒక వ్యూహం….
ఉండవల్లి మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన ఈ లేఖ అతని వివాదాస్పద పాలనను పారదర్శకంగా ఎత్తిచూపేలా ఉందని ఇక జగన్ ప్రభుత్వం ఇంత కన్నా ఎంతో బాగా పరిస్థితిని అదుపు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జగన్ ఈ లేఖ బహిరంగంగా రాయడానికి వెనుక ఒక వ్యూహం ఉందని ఉండవల్లి తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో జగన్ ఎప్పుడూ ఏదో ఒక వ్యూహంతో బరిలోకి దిగుతారని దానిలో భాగంగానే అతను ఈ లేఖ రాసి ఉంటారన్నది దీని సారాంశం.
వారే కీలకం..!
ఇకపోతే జగన్ కు ఈ విషయంలో బీజేపీ సపోర్ట్ కచ్చితంగా కావాలని ఉండవల్లి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా జగన్ వైసీపీ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ పెట్టిన ప్రతి బిల్లును సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు పాలన మండలికి న్యాయ వ్యవస్థకు జరుగుతున్న ఈ పోరులో జగన్ కు కచ్చితంగా మోడీ మద్దతు కావాలని… లేకపోతే జగన్ వేసిన వ్యూహంలో అర్థం ఉండదని ఉండవల్లి అభిప్రాయపడ్డాడు. కచ్చితంగా బిజెపి వైసిపి అధినేతకు సహకరిస్తుంది అనడానికి కూడా ఎలాంటి గ్యారెంటీ లేదని అనేందుకు కూడా తేల్చిచెప్పేశాడు.
సడెన్ గా ఏమైనట్లో…
మనం గమనించినట్లయితే ఉండవల్లి అరుణ్ కుమార్…. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కినప్పుడు అతనిని తెగ పొగిడేశాడు. అతను తీసుకున్న నిర్ణయాలన్నీ రాజకీయ సంస్కరణలు అని కితాబు ఇచ్చాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశారు. ముఖ్యంగా మూడు రాజధానులు విషయం మొదలైనప్పటి నుండి జగన్ చేస్తున్న ప్రతి పనిలోని తప్పులను ఎత్తిచూపుతూ వాటిని తన విశ్లేషణలు గా బయట పెడుతున్నాడు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి అత్యున్నత నేత ఇలా ఆరోపణలు చేయడం వెనుక కేవలం తన నిజాయితీ మాత్రమే దాగుందా లేదా ఇంకేదైనా ఉందా అన్న అనుమానాలు మాత్రం జోరుగా వస్తూనే ఉన్నాయి.