లాక్ డౌన్ కారణంగా పాలనలో జోరు తగ్గిన తెలంగాణ సర్కార్ తాజాగా మళ్లీ వేగవంతం చేయడానికి రెడీ అయ్యింది. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో ఎక్కడ కనబడిన దాఖలాలు పర్యటనలు లేవు. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు భారీ స్థాయిలో రావడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నఫలంగా రంగంలోకి దిగారు. కరోనా వైరస్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయే విధంగా కేటిఆర్ చక్రం తిప్పుతున్నారు.
చాలావరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాపించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా సామాన్య ప్రజల నుండి రావటం మనం అందరం చూశాం. వస్తున్నా విమర్శలకు చెక్ పెడుతూ కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో పలు అభివృద్ధి పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. జిల్లాల వారీగా కేటీఆర్ పర్యటనలు చేస్తూ తనతో పాటు మంత్రులను కూడా కూడా పెట్టుకుని వెళుతూ ప్రజలకు తోడుగా ప్రభుత్వం ఉంది అన్న రీతిలో కేటీఆర్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.
అంతేకాకుండా కరోనా విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రసంగంలో కరోనా వైరస్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్పీచ్ లు ఇస్తున్నారు. మొత్తానికి పాలనాపరంగా కేటీఆర్ కీలక మార్పులు ప్రజలు గమనించేలా ముందుండి నడిపిస్తున్నారు.